విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా

TRINETHRAM NEWS

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా…

అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా..

తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది..

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు.

తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని, సీఎం జగన్ తో భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలోకి దిగుతారని ప్రచారం మొదలయింది…

You cannot copy content of this page

Scroll to Top