WhatsApp Image 2025 02 14 at 16.48.42
తేదీ : 14/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసిపి నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదేవిధంగా మరికొందరి అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని, అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేసులో కొడాలి నాని తోపాటు దేవినేని అవినాష్, వె ల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా జైలుకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
