అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు

TRINETHRAM NEWS

అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు..

ముత్తారం మండలం
త్రినేత్రం న్యూస్ ఆర్ సి

ముత్తారం మండల కేంద్రంలోని కల్వరి క్రీస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్ చెరుకుపల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండగ వేడుకను ఘనంగా జరుపుకున్నారు . ఈ వేడుక సందర్భంగా ప్రార్థన మందిరాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్ చెరుకుపల్లి సుదర్శన్ ప్రత్యేకమైన కేక్ కట్ చేసి సంఘ సభ్యులకు అందజేశారు.
ఈ వేడుకను ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడుతూ సహపంక్తి భోజనాలతో కోలాహలంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో సంఘ సభ్యులు అంబటి చంద్రమౌళి రొడ్డ సంపత్ ,ఇనుముల శ్రీనివాస్ ,అంబటి శివకుమార్ ,భేద సంపత్ ,గుండా కుమార్, రోడ్డ శ్రావణ్ ,రొయ్యల రాజకుమార్ ,జెల్ల శ్రీనివాస్ ,చరణ్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top