మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

TRINETHRAM NEWS

Late night: మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది. ఇటు తెలంగాణ‌, అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇవాళ‌, రేపు రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది. బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.

You cannot copy content of this page

Scroll to Top