జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 12 at 4.09.28 PM

TRINETHRAM NEWS

సీఎం సహాయనిధి… పేదల ఆరోగ్య పెన్నిధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన ముగ్గురు నివాసులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 4.50 లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్ఓసి చెక్కులను ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదరికంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఆరోగ్య భద్రత, భరోసానిస్తుందన్నారు.

ఎల్ఓసి చెక్కులు మంజూరైన లబ్ధిదారుల వివరాలు : –

(1) 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -2 కి చెందిన శ్యామల భర్త నర్సింగ్ రావు – 1.00 లక్ష రూపాయలు,

(2) 128 – చింతల్ డివిజన్ చంద్ర నగర్ కు చెందిన సిహెచ్. చంద్రిక తల్లి సిహెచ్. లక్ష్మి – 1.50 లక్షలు,

(3) సూరారం కి చెందిన డి.తేజస్విని తండ్రి డి. పెంటయ్య – 2.00 లక్షలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page