ఆరాధ్య స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

TRINETHRAM NEWS

ఆరాధ్య స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ పట్టణంలోనూతనంగా ఏర్పాటు చేసిన ఆరాధ్యస్పెషాలిటీక్లినిక్స్ ను ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందిస్తూ.. పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ జోత్స్న లకు చైర్ పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్, సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్, మోముల రాజ్ కుమార్, లక్ష్మీ నివాస్ రాటి, మోనిగారి శేఖర్, గోపాల్ రెడ్డి, సంగప్ప, బందెప్ప గౌడ్, KT సంగప్ప, హాస్పటల్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top