TRINETHRAM NEWS

ఆడుదా ఆంధ్ర కార్యక్రమం పై నిర్లక్ష్యం

బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం చింతయపాలెం హైస్కూల్లో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం వద్ద కనీసం ఆడుదాం ఆంధ్ర బ్యానర్ కానీ మైక్ కానీ లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.