TRINETHRAM NEWS

A crore rupees ticket for Srivari Seva!

స్వామి వారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కనులారా చూసి తరించవచ్చు

Trinethram News : తిరుమల తిరుపతి :

ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు కోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈ సేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి.

ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను నేరుగా దర్శించవచ్చు. అలా 25 ఏళ్లు, లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగ్గట్లుగా ఈ టికెట్ ను వినియోగించుకోనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ సేవల్లో భక్తుడితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A crore rupees ticket for Srivari Seva!