TRINETHRAM NEWS

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మరియు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు… ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ముందుగా క్రైస్తవ సోదర సోదరీమనులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, దయ గలిగిన ఏసుక్రీస్తు ప్రభు భూమిమీదకు వచ్చిన పవిత్రమైన రోజును క్రిస్మస్ పండుగా జరుపుకుంటామని అన్నారు. ఆ ప్రభు యెక్క చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ మెండుగా ఉండేవిధంగా చూడాలని ఆ ఏసు క్రీస్తు ప్రభువు ను కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుని, సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దైవ జనులైన పాస్టర్ లకు దుస్తులు పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.