TRINETHRAM NEWS

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టగా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది..

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కాంతయ్య, శంకర్, భరత్, చందనగా పోలీసులు గుర్తించారు. ఎల్కతుర్తి మండలం పెంచికల పేట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఏటూరు నాగారం వాసులుగా పోలీసులు గుర్తించారు. వేములు వాడ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది..