TRINETHRAM NEWS

చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన నూతన సమస్త ప్రారంభోత్సవం శ్రీ రేణు రాగాలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బిజెపి సాంస్కృతిక సెల్ కన్వీనర్ అమ్మ అనాధాశ్రమం ట్రస్టు చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శ్రీ వంశీ రామరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత డాక్టర్ మల్లెపూల వెంకటరమణ వహించారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి నూతన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో విరివిగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో నూతనంగా మరొక పది సంస్థలు వస్తున్నాయని వారు మాట్లాడినారు సంస్థలను నిర్వహిస్తూ ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయం గుర్తుంచుకోవాలని పూల వెంకటరమణ మాట్లాడినారు ఏది ఏమైనప్పటికీ కళాకారులు అన్ని రంగాలలో టీవీ సీరియల్ సినిమా రంగాలలో అభివృద్ధి చెందినటువంటి వారు శిక్షణ తీసుకొని చక్కటి పాటలతో మన ముందుకు వస్తూ మంచి పాటలతో మనల్ని ప్రేక్షకులను ఆనందింప చేస్తున్నారు ఇలాంటి కలలు భారతదేశంలో పూర్వము రాజులు చాలా చక్కగా గౌరవించేవారు కలలున్న కళాకారులు అన్న వారికి ఎంతో ప్రేమ వారి ఆస్థానాలలో వారికి వసతి కల్పించి వారి నీ ఆదరించేవారు రాను రాను కాలాన్ని పరిస్థితిని బట్టి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులు చక్కటి భక్తి గీతాలు లిటిల్ స్టార్ చిన్న పిల్లలు కార్యక్రమాలు సినిమా పాటలు పాడి రసజ్ఞులైన ప్రేక్షకులను మెప్పించ చేశారు ఈ కార్యక్రమాలను లైవ్ టీవీ ద్వారా దేశ విదేశాలలో ఉన్న వారు కూడా తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమం రేణుక రాగాలు అధ్యక్షురాలు రేణుక నిర్వహించడం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి శ్రీ వంశీ రామరాజు ఓంకార్ రాజు డాక్టర్ త్రినాధ రావు వ్యాఖ్యాత మనోహర్ పాల్గొని జయప్రదం చేశారు అనంతరం మల్లెపూల వెంకటరమణకు ఆత్మీయ సత్కారం కళాబ్రహ్మ వంశీ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది