WhatsApp Image 2024 03 31 at 6.05.59 PM
Trinethram News : Mar 31, 2024,
100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్
వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించాను. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినందుకే రైతులు పంట వేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వంద రోజుల్లో ఇంత దుర్భర పరిస్థితి చూస్తాననుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.
