WhatsApp Image 2024 03 29 at 14.22.49
Trinethram News : Mar 29, 2024,
యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత యాదాద్రిగా పేరు మార్చారని, పేరు మార్చటంతోపాటు యాదాద్రి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
