జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 23 at 11.23.40

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు.

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల 15 హైద రాబాద్ లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. గత ఆరు రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమా చారం. రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కాం కు సంబంధిం చిన అన్ని వివరాలు బయ టకు వస్తాయని ఈడీ భావిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికి వస్తానని, బాధ పడవద్దు అంటూ ధైర్యం చెప్పారు…

You cannot copy content of this page