కాలువలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Mar 22, 2024,

యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

You cannot copy content of this page

Scroll to Top