TRINETHRAM NEWS

నల్గొండ: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు….