ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 11
పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది.

దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా
ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి.

ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు.భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళ వారం నుండి ప్రారంభమవు తుంది. ఈ నెలలో, ముస్లిం లు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవా సం ఉంటారు.
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
ఇది నెల ప్రారంభం, ముగిం పును నిర్ణయించడంలో కీల కమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లిం లు ఈద్-ఉల్-ఫితర్ జరుపు కుంటారు…

You cannot copy content of this page

Scroll to Top