TRINETHRAM NEWS

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం

సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద నుండి మురుగు కాలువలో దాట్టంగా చెట్లు పెరగడం మరియు పట్టణంలో కాలువ లెవల్ డౌన్ గా ఉండి ఊరు బయట ఎత్తుగా ఉండటం వలన మురుగు నీరు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆగిపోయింది. రాజకీయ నాయకులు మరియు అధికారులు ఈ సమస్య పై దృష్టి పెట్టి ప్రజల సమస్యను తీరుస్తారని బాపట్ల వార్త కోరుకుంటుంది.