ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది

TRINETHRAM NEWS

ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది.

ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది.

కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు సమాచారం.

సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్ వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం. తన సర్వీసులకు రాజీనామా చేసి మరీ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

You cannot copy content of this page

Scroll to Top