TRINETHRAM NEWS

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట్ లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి కృప అందరిపై ఎల్లపుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ఉప్పరి బాల క్రిష్ణ, మునిసిపల్ యూత్ అధ్యక్షులు మైసిగారి శ్రీకాంత్, నాయకులు ప్రేమ్, ప్రవీణ్, పురుషోత్తం, నాగరాజ్, మహేందర్, శ్రీను, అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు…