TRINETHRAM NEWS

Trinethram News : Farmers Protest: నేడు భారత్​ బంద్​ కు సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా..

ఈ భారత్​ బంద్ ​ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్​లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్​ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది..

నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు..

రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్​లు ఉన్నాయి..

  1. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.
  2. రైతు రుణ మాఫీ.
  3. స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సుల అమలు.
  4. 2020 విద్యుత్​ చట్టం ఉపసంహరణ.
  5. లఖింపుర్​ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.
  6. గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
    మరి రైతులు పిలుపునిచ్చిన