మేనకూరు సెజ్ కు కార్మికులతో వెళుతున్న ఆటో ను ఢీ కొన్న లారీ,పలువురికి గాయాలు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జిల్లా..నాయుడుపేట

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మేనకూరు సేజ్ లోని వివిధ పరిశ్రమలకు  మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటన  హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మహిళా కార్మికులలో  సురేఖ, సులోచన, వజ్రమ్మ,  జ్యోతి లకు గాయాలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించి చికిత్సలు అందించారు. సురేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధమ చికిత్సల అనంతరం మెరుగైన చికిత్సల కోసం నెల్లూరు తరలించారు.

You cannot copy content of this page

Scroll to Top