TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం నగరంలో 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో జరిగిన సఖిజాతీయ మహిళా మండలి సమావేశంలో దండమూడి గిరిజ ను సఖిజాతీయ మహిళా మండలి నేషనల్ కో- కన్వీనర్ గా సంస్థ ఫౌండర్ & చైర్మన్ నరాల సత్యనారాయణ నియమించారు . 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేష్ శుభాకాంక్షలు తెలిపారు . నూతనంగా నియమించబడ్డ నేషనల్ కో- కన్వీనర్ దండమూడి గిరిజ బేడ బుడగ సంఘం మహిళ జిల్లా అధ్యక్షురాలుగా ఆ తర్వాత జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారని . స్వచ్ఛభారత్ మరియు కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని , నిరుపేద మహిళలకు అండగా ఉంటూ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ వారి మనలను పొందుతున్నారని చిట్టి పొట్టి తగాదాలతో భార్యాభర్తలు విడిపోవడం వచ్చిన సమయంలో కూడా వారికి నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇప్పించి కలిపిన దాఖలు కూడా ఉన్నాయి అన్నారు . ఎన్నో కుటుంబాలను నిలబెట్టారని పేర్కొన్నారు . ఇప్పటికీ 27వ డివిజన్లో మహిళలకు ఏ సమస్య వచ్చినా వారి ఇంటి డోర్ తడతారన్నారు . నన్ను గుర్తించి ఈ బాధితులు అప్పజెప్పినందుకు సఖిజాతీయ మహిళా మండలి సంస్థ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .