Trinethram News : నందిగామ: తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే ‘నిజం గెలవాలి’ చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే నారా భువనేశ్వరి
Related Posts
Anna canteen : అన్న క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు
TRINETHRAM NEWS TDP leaders who beat Anna canteen for ribbon cutting Trinethram News : Andhra Pradesh : రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను…
అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి
TRINETHRAM NEWS Donors should come forward for food donation program as inspiration of Anna canteens ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం… మొత్తం 203కు పెంచుతాం పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాం బుడమేరు వరద…