TRINETHRAM NEWS

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు.

ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద సమయంలో బస్సుల్లో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముందు టైర్లు పేలడంతో బస్సు అదుపుతప్పింది. ఆ వెంటనే బస్సు వెనక చక్రాలు కూడా ఉన్నట్లుండి ఊడిపోయాయి.

కాగా..క్షణాల్లోనే బస్సును కంట్రోల్‌లోకి తీసుకున్న డ్రైవర్.. నిలిపేశాడు. దాంతో.. వెంటనే ప్రయాణికులంతా బస్సు నుంచి బయటకు దిగారు.