
Joseph Ravan Transferred Vijayawada : త్రినేత్రం న్యూస్ : వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్పై నమోదైన కేసులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడ కోర్టులకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సాధారణ కేసులను విజయవాడలోని రెండవ అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తరలించారు.
అదేవిధంగా, జోసెఫ్ రావణ్పై ఉపా (UPA) చట్టం కింద నమోదైన అత్యంత కీలకమైన కేసులను విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసినట్లు సమాచారం. కాగా, నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు వీలుగా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై కోర్టులో మరోమారు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe