క్రీడలతో శరీర దృఢత్వం పెంపొందుతుంది
క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ డివిజన్ జనవరి 14 త్రినేత్రం న్యూస్. యువత అన్ని రంగాల్లో రాణించాలని దేవరకొండ బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.బుధవారం కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ బిఆర్ ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. క్రీడలతో శరీర దృఢత్వం పెంపొందుతుంది అని ఆయన అన్నారు. క్రీడలలో రాణించాలని ఆయన సూచించారు.యువతకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కావాటి వెంకటేష్,పిల్లి పరమేష్,పంది హరికృష్ణ,పంది శ్రీరాములు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


