TRINETHRAM NEWS

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ పై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అర్హులైన రైతులకు రాయితీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శనగ విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు సంబంధిత శాఖ అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..