
Trinethram News : Apr 14, 2025, BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని.. చెప్పినట్లే చేశామని సీఎం రేవంత్ అన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ‘భూభారతి’ చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణి పొర్టల్ను తెచ్చింది. ఈ పోర్టల్ ఎన్నో సమస్యలకు కారణమైంది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
