TRINETHRAM NEWS

Trinethram News :

శబరిమల ప్రసాదం అరవణ పాయసం విక్రయాల పై పరిమితి విధించిన ట్రావెన్ కోర్ బోర్డ్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి స్వాములు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది, ఈ రద్దీ పెరగటంతో స్వామి వారి ప్రసాదం అరవణ పాయసం డబ్బాలు కొరత ఏర్పడింది.

ట్రావెన్ కోర్ బోర్డ్ వారు ప్రసాదం కొరత వలన ఒక్కో స్వామి రెండు అరవణ పాయసం డబ్బాలు మాత్రమే అనే నిబంధన పెట్టారు. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.