TRINETHRAM NEWS

రేపు పుష్యపౌర్ణమి

పుష్యపౌర్ణమికే ‘పౌషీ’
అనే పేరు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది.

పుష్య పూర్ణిమని “శాకాంబరి జయంతి” గా జరుపుకుంటారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు.

పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు, చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడింది. భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయి మరియు అన్ని మొక్కలు మరియు వృక్షాలు ఎండిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో, అందరూ కలిసి భగవతిదేవిని ఆరాధించారు. ఆమె భక్తుల పిలుపు విన్న దేవత భూమిపై శాకంభరిగా అవతరించి భూమిని వర్షపునీటితో తడిపింది. ఇది భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకుంది. చుట్టూ పచ్చదనం ఉంది. అందువల్ల, ఈ దేవత యొక్క అవతారాన్ని శాకంభరిగా పూజిస్తారు మరియు ఈ రోజును శకంభరి పూర్ణిమ లేదా శకంభరి జయంతిగా జరుపుకుంటారు.

శాకంబరి వివరణ శ్రీ దుర్గసప్తశతిలో కనిపిస్తుంది.శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది.

శాకంబరీ దేవి ఉత్సవం సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు.

ఇందుకు సంభందించిన పురాణ గాధ తెలుసుకుందాం ..

వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తి హీనులైపోయారు. నదీ నదాలు ఎండి పోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.

ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవి కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు.

ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.

పార్వతీ దేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది…

శ్రీ మాత్రే నమః

నెమలికంటి హనుమంతరావు,శ్రీ లలితాత్రిపుర సుందరీపీఠం,బాపట్ల