
తేదీ : 05/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ ముప్పాళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు అనగా రైతులకు శుభవార్త అందించారు. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూపాయలు ఆరువేల తో కలుపుకుని మొత్తంగా రూపాయలు ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత వైసిపి ప్రభుత్వం అప్పులు పెట్టి వెళ్లిపోయిందని అన్నారు. సంపద సృష్టించి ఆదాయం పెంచాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
