Tenth Exams : త్రినేత్రం న్యూస్ : Mar 12, 2026, తెలంగాణ : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఆ విద్యార్థులను అనుమతిస్తారు.
ఆ తర్వాత వచ్చే వారికి మాత్రం అనుమతి ఉండదు. అంటే ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.


