TRINETHRAM NEWS

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్

Trinethram News : ముంబై :జనవరి 07
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ముంబై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 30-37 తేడాతో గుజరాత్ జెయింట్స్ ఓడించింది.

మొదట ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌దే పైచేయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఆ జట్టు 19-14తో ఆధిక్యంలో ఉంది.అయితే, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయింది.

ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఆలౌటైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ వరుస పాయింట్ల తో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

రాకేశ్ 10 పాయింట్లు, దీపక్ సింగ్ 9 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్ 8 పాయింట్లు, సంజీవి 7 పాయింట్లతో పోరాడినప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం కరువైంది.

మరోవైపు, టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా యు ముంబాను 31-41 తేడాతో ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.