TRINETHRAM NEWS

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.

ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఈ రోజు లేదా రేపు ఏ క్షణమైనా అభ్యర్ధులను ప్రకటించాక ఈ నెల 23న విజయవాడలో మొత్తం 144 అసెంబ్లీ అభ్యర్దులు,17 పార్లమెంట్ అభ్యర్దులతో టీడీపీ పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తుంది.

ఈ వర్క్ షాప్ లో ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్ధులకు అవగాహన కల్పిస్తారు.

విజయవాడ లోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ టీడీపి పార్టీ వర్క్ షాప్ కార్యక్రమానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై నేతలకు కొన్ని ముఖ్య సూచనలు చేసి రానున్న 55 రోజుల్లో పార్టీ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారు.