TRINETHRAM NEWS

Trinethram News : స్థానిక బాపట్ల క్రొత్త బస్ స్టేషన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో బాబా వారి విగ్రహ ప్రతిష్ట జరిపి28 సంవత్సరం లు అయినందున గురువారం నుండి సోమవారం వరకు బిక్షాటన కార్యక్రమం జరుగునని బాపట్ల శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి సభ్యులు తెలియజేశారు. గురువారం షిరిడి సాయిబాబా దేవాలయం నుండి భిక్షాటన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి శివ, కంచర్లపల్లి రాజ్యలక్ష్మి (అధ్యక్షులు) సెక్రటరీ ఓడా గోవిందరావు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.