ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Shining Star Award Presented

Shining Star : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19; ఉండి నియోజకవర్గం, మండలం, మహాదేవుని పట్నం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని చెన్నం శెట్టి సాయి పల్లవికి మెరుస్తున్న నక్షత్రం అవార్డుకు ఎంపిక అయినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ బాబు తెలిపారు. అయితే ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపిక కాబడిన ఏకైక విద్యార్థిని సాయి పల్లవి అన్నారు.

ఈ అవార్డును ఈనెల అనగా జూలై ఇరవై తేదీ సోమవారం నాడు అందజేయడం జరుగుతుంది. దీనిని జిల్లా ఇన్ ఛార్జ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదగా అందుకోనట్లు పేర్కొన్నారు. అవార్డు ద్వారా రూపాయలు ఇరవై వేలు నగదు మరియు మోడల్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. గ్రామ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులందరూ అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page