డిండి ( గుండ్ల పల్లి) జులై 04 త్రినేత్రం న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమం డిండి మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డిండి తహసీల్దార్ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ ముస్తఫా, సురేష్, వెంకట్, నరేందర్, దిలీప్, తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


