TRINETHRAM NEWS

మన్యం జిల్లా:

పాలకొండ నియోజక వర్గంలో పాలకొండ మండలంలో సిరికొండ గ్రామ సమీపంలోని రహదారి మలుపు వద్ద ఈ రోజు రోడ్ ప్రమాదం జరిగింది.

పాలకొండ నుండి వస్తున్న ఆటో, సీతంపేట నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా, బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు. సమీపంలోని గ్రామస్థులు వెంటనే అంబులెన్స్, పోలీస్ వారికి కాల్ చేసి సమాచారం అందించారు.