TRINETHRAM NEWS

అమరావతి :

కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు.

అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును సత్కరించారు.

కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు కుప్పం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు.

జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు 21వ వార్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు చంద్రబాబుకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి సత్కరించారు.