WhatsApp Image 2024 02 20 at 9.11.38 PM
Trinethram News : నూజివీడు
ఏలూరు జిల్లా :- నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. టీడీపీ ఆఫీస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీసు నిర్మించి, 10 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్తే తనకే అన్యాయం చేశారని వాపోయారు. ఇన్ని రోజులు తనను వాడుకొని బయటకు గెంటేసిన వారిని వదిలి పెట్టేది లేదని, అంతు తేలుస్తానని అన్నారు. ఈ విషయమై పోరాడతానని స్పష్టం చేశారు.
