TRINETHRAM NEWS

National Mala Mahanadu Sangam congratulated Akunuri Murali who was elected as the Chairman of Telangana Vidya Sansthan

గోదావరిఖని చౌరస్తా లోనీ జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో

తెలంగాణ విద్య సంస్థ చైర్మన్ గా ఎన్నికైన ఆకునూరి మురళి శుభాకాంక్షలు తెలిపిన జాతీయ మాల మహానాడు సంఘం.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాలెం మధు మాట్లాడుతూ ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రంలో అత్యున్నత స్థానం అయినటువంటి ఐఏఎస్ వరకు తన తెలివితేటలతో ముందు చూపుతో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు చదువు చాలా అవసరమని పలు రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి స్కూల్లో వసతులను సందర్శించి వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాలకు మార్పు అభివృద్ధి చదువుతూనే అవుతుంది అనిప్రపంచంలో అత్యున్నతమైన స్థానాల్లో మన దేశ పౌరులే ఉండాలని కోరుకున్న వారిలో ముఖ్యులు నాకు నూరి మురళి ఇతని చిత్తశుద్ధిని చూసి ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖలో స్థానం కల్పించి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నెలకొల్పి వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలుచూసుకునే బాధ్యతలు అప్పగించడం జరిగింది . ఆలంటి వ్యక్తి మనకు ఇక్కడవిద్యాశాఖ కమిషన్ మెంబర్ గా రావడం గర్వకారణం అని అన్నారు .

ఈ కార్యక్రమంలో ,పట్టణ అధ్యక్షుడు మాలెం మధు ,జనరల్ సెక్రెటరీ కొండ కుమార్, దాసరిరామస్వామి, లక్ష్మీనారాయణ నూకల మొండయ్య బొమ్మక వెంకటేశ్వర్లు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Mala Mahanadu Sangam congratulated Akunuri Murali who was elected as the Chairman of Telangana Vidya Sansthan