TRINETHRAM NEWS

Trinethram News : పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ప్రారంభమైన ర్యాలీ.

పసుపుమయమైన మంగళగిరి ప్రధాన రహదారులు, ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు, అభిమానులు.

యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

సీతారామస్వామి కోవెల, మిద్దె సెంటర్ నడుమ భారీగా జనసందోహం, ద్విచక్ర వాహనాలపై తరలివస్తున్న అభిమానులు, సామాన్య ప్రజలు.

టీడీపీ-జననేస-బీజేపీ జెండాలతో కార్యకర్తల హల్ చల్, కోలాహలంగా మారిన సీతారామ స్వామి కోవెల, మిద్దె సెంటర్ ప్రాంతాలు.

2గంటల ప్రాంతంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్న కూటమి నేతలు.

మధ్యాహ్నం 2.34గంటలకు కూటమి నేతల ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీనేతల చేతలమీదుగా యువనేత నారా లోకేష్ నామినేషన్.