
శ్రీ మహా గణపతి లక్ష్మి మహా చండీయాగం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12: నెల్లూరు జిల్లా: కావాలి. కావలి, మండలం రాజువారి చింతల పాలెంలో శ్రీశ్రీశ్రీ విజయ్ దుర్గ ఆస్థాన పీఠం పత్రి బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ మహా గణపతి లక్ష్మి మహా చండీయాగం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,అనంతరం స్వామివారిని దర్శించుకుని మహా చండీయాగం పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో , సుఖసంఖ్యాలతో, ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎల్లవేళలా ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియపరిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
