రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

TRINETHRAM NEWS

ఈరోజు 32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,స్థానిక కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి గారు.ఈ సందర్భంగా గౌరవ అతిథులు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లారెడ్డి సేవా ట్రస్ట్ వారికి హాస్పిటల్ యాజమాన్య సిబ్బందికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని,ఉచిత వైద్య పరీక్షలను,మందులను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,కోలన్ వీరేందర్ రెడ్డి,NMC బిఆర్ఎస్ బీసీ సెల్ జెనరల్ సెక్రెటరీ దశరథ్, స్థానిక రాజీవ్ గృహకల్ప 31,32,33 డివిజన్ల అధ్యక్షులు బిక్షపతి,అశోక్,ముత్యాలు,మహిళా నాయకులు స్వర్ణ కుమారి,నర్మద,సుకన్య,యువ నాయకులు తొంట చందు,నాయక్,ఆర్ జి కే నాయకులు,కాలనీ వాసులు,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top