TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలలో భాగంగా ….

కొత్తూరు మండలం లోని ఓండ్రుజోల గ్రామ ఆవరణలో
నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీల కార్యక్రమానికి, స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి గారు ముఖ్య అతిథిగా హాజరై కాసేపు క్రికెట్ ఆటను ఆడి యువతలో నూతన ఉత్తేజాన్ని పెంపొందింపజేసారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ చింతాడ సూర్య నారాయణ, మండల కన్వీనర్ శారిపిల్లి ప్రసాద్, గండివలస ఆనందరావు, మొజ్జాడ చక్రపాణితో పాటు గ్రామస్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.