TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల జిల్లా:మార్చి05
మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్, ఆత్మ కూర్, మెట్ల చిట్టాపూర్, విట్టం పెట్, గ్రామాల్లోని జిల్లా పరిషత్ స్కూల్లను కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో గల ఇబ్బందు లను తెలుసుకున్నారు.

రానున్న రోజుల్లో పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.