TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ అభ్యర్థనను విచారించింది. కాగా.. ఈ కేసులో మార్చి 21న కేజీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.