TRINETHRAM NEWS

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

అయితే.. ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం .. ఆయన ధరించిన షర్ట్.. పోలింగ్ డే రోజున ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకుని వచ్చి ఓటు వేశారు.

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలింగ్ డే రోజున జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ లో కనిపించడం వెనుక రాజకీయ కారణం ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

బ్లూ షర్ట్ వేసుకొచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజన్లు ఎక్స్ లో షేర్ చేస్తుండటంతో ఇటు సోషల్ మీడియాతోపాటు.. అటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లోనే కనపించారని.. ఇలాంటి ప్రచారం అర్ధరహితమని మరికొందరు ఫ్యాన్స్ వాదనలను కొట్టిపడేస్తున్నారు.