Mahadharna : జూలై 09 చలో ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా. 01 జులై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా క్షయ నివారణ విభాగం ఎన్.టీ.ఈ.పీ.లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గత 2 నెలల వేతనం అనగా మే మరియు జూన్ జీతాలు ఇప్పించాలని, వేతనాలు ఎందుకు ఆగినయో తెలుసుకోవాలని పై అధికారులతో చర్చించి ఇప్పించాలని క్షయ నివారణ ఆఫీసర్ డాక్టర్.ఆచార్య పాత్ర కి వినతిపత్రం ఇచ్చిన ఎన్ టి ఈ పి ఉద్యోగులు హక్కుల సాధనకై 09 జులై 2025 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపు ఇచ్చిన ఏఐటీయూసి ఆల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ ఎన్.హెచ్.ఎం లో వివిధ బాగాల్లో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న ఉద్యోగులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు హాజరు కావాలన్నారు. ఒక్కరోజు మహాధర్నా హైదరాబాద్ ఇందిరా పార్క్ నిర్వహిస్తున్న సందర్భంలో ఆరోజు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. ఆచార్యను ఎన్ టి ఈ పి వరంగల్ జిల్లా ఉద్యోగులు వినతిలో కోరారు ..

ఈ కార్యక్రమంలో వరంగల్ క్షయ వ్యాధి ఉద్యోగులు ఎస్.టి.ఎల్.ఎస్ లు ఏ.రంజిత్,టి.శ్రీధర్, ఎస్.టి.ఎస్.లు అశోక్ , నరేష్ , సుభాషిని,టి.బి.హెచ్.వి. సంకీర్తన మాధవి, డి పి పి ఎం నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

July 09 Chalo Indira Park

You cannot copy content of this page

Scroll to Top